Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విరాట్ కోహ్లీ కూడా అదే తప్పు చేశాడు.. సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే?

Advertiesment
IPL 2020
, మంగళవారం, 6 అక్టోబరు 2020 (12:36 IST)
క్రికెట్‌లో బంతి షైన్ అవ్వాలంటేనే క్రికెటర్లు దానిపై ఉమ్మి రాయడం చాలాకాలంగా చేస్తున్నారు క్రికెటర్లు. కానీ కరోనా నిబంధనల కారణంగా ఆ పనిచేయడానికి ఇప్పుడు లేదు. కొద్దిరోజుల కిందట రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప అదే పొరపాటును చేసి విమర్శలు అందుకున్నాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అదే తప్పు చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. వెంటనే తన తప్పు తెలుసుకోవడం విశేషం.
 
ఢిల్లీ కాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో మూడో ఓవర్ జరుగుతున్న వేళ, ఓపెనర్ పృథ్వీ షా ఆడిన షాట్‌ను షార్ట్ కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ అడ్డుకున్నాడు. ఆపై తన నోటి నుంచి ఉమ్మిని తీసి బంతికి పూశాడు. ఆ వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకుని, పొరపాటై పోయిందన్నట్టు సంజ్ఞ చేశాడు. ఈ ఘటనపై సరదా కామెంట్లు వస్తున్నాయి.
 
కరోనా ముప్పు దృష్ట్యా సలైవా వాడకాన్ని ఐసీసీ జూన్‌లో తాత్కాలికంగా నిషేధించిన సంగతి తెలిసిందే. రెండు సార్లు తప్పు చేస్తే హెచ్చరించాలని, అయినా రిపీట్ చేస్తే ఐదు పరుగుల పెనాల్టీ ఇవ్వాలనే నిబంధనను తీసుకొచ్చింది. దీనిపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. "గెలిచే కసిలో అంతే... అప్పుడప్పుడూ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి" అంటూ సచిన్ ట్వీట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరోన్ ఫించ్‌ను ఆడుకున్న అశ్విన్.. ఔట్ చేస్తానని బంతిని వేయకుండా..?